బంజారాహిల్స్, జనవరి 1: న్యూఇయర్ వేడుకల్లో భాగంగా మోతాదుకు మించి శబ్ద కాలుష్యాన్ని కలిగించినం దుకు జూబ్లీహిల్స్లోని ఆరు పబ్బుల నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లోని హాలో పబ్, రోడ్ నం 10లోని టారో పబ్, రోడ్ నం 37లోని మకావ్ పబ్, రోడ్ నం 36లోని జెనా పబ్, గ్రీస్ మంకీ పబ్, లఫ్ట్ పబ్లలో విపరీతమైన శబ్దాలతో మ్యూజిక్ ప్లే చేస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయా పబ్బుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.