సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): హెరాయిన్ డ్రగ్స్ విక్రయిస్తున్న గుజరాత్, రాజస్థాన్కు చెందిన ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 50 లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ కథనం ప్రకారం.. గుజరాత్కు చెందిన ట్యాంక్ పంకజ్ బాయ్ హైదరాబాద్లోని అంబర్పేటలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. అతడికి అదే ప్రాంతంలో నివాసముండే రాజస్థాన్కు చెందిన ప్రజాపతి ముఖేశ్ లక్ష్మణ్ బంధువు. వీరిద్దరూ డ్రగ్స్కు అలవాటు పడ్డారు. రాజస్థాన్లో తమకున్న పరిచయాలతో హెరాయిన్ కొని, హైదరాబాద్కు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందానికి అందిన విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం నాగోల్ ఎక్స్ రోడ్డులో వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 70 గ్రాముల హెరాయిన్, రూ.1,570 నగదు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.