బోడుప్పల్, నవంబర్29: సీఎం కేసీఆర్ దృష్టికి బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని దళితుల ల్యాండ్ ఫూలింగ్ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం సరస్వతీనగర్ అంబేద్కర్ భవన్లో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్ బుచ్చిరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…బోడుప్పల్ సర్వేనంబర్63/2,63/25 వరకు సుమారు 380ఎకరాల అసైండ్ ల్యాండ్ను ల్యాండ్ ఫూలింగ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమస్యకు పరిష్కారం చూపుతానని మంత్రి హామీ ఇచ్చారు.దళితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, దళితుల అభివృద్ధే లక్ష్యంగా సీం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు,దళిత కుటుంబాలు, నాయకులు పాల్గొన్నారు.