కరోనా వైరస్పై జీహెచ్ఎంసీ యుద్ధం ప్రకటించింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనాను కట్టడి చేసేందుకుగాను పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలు, వాటి పరిసరాలు, జనసాంద్రత గల ఏరియాలు, ఆసుపత్రులు, ఇనిస్టిట్యూట్స్, పర్యాటక ప్రాంతాల్లో డీఆర్ఎఫ్, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలోని 30సర్కిళ్లు, 150 వార్డుల్లో నిత్యం 16వేల ఇండ్లలో పిచికారీ చేస్తున్నారు. రోజూ 400 నుంచి 500 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ను వాడుతున్నారు. ఎక్కువ శాతం చార్మినార్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ఎంటమాలజీ చీఫ్ రాంబాబు తెలిపారు.