చాదర్ఘాట్ :ఆజంపురా డివిజన్లోని కమల్నగర్లో జనావాసాల మధ్యకు నాగుపాము రావడం తీవ్ర కలకలం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ వెనుక ఉన్న కమల్నగర్లో ఓ భారీ నాగు పాము జనావాసాల మద్యకు వచ్చింది. ఆ సమయంలో స్థానికంగా నివాసముండే ఫాతిమా అనే మహిళ మంచినీళ్లు పట్టుకునేందుకు నిద్రలేచి బయటికి వెళ్లగా ఇంటి ముందు పెద్ద నాగుపాము కనిపించింది. ఆమె భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లందరు నిద్రలేచి చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో రాత్రి విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ హన్మంతరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వెంటనే స్నేక్ సొసైటీ వారికి ఫోన్ ఫోన్ చేయగా సోసైటీ సభ్యుడు మనీష్రెడ్డి అక్కడికి చేరుకుని పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు.