హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్కు అనుసంధానంచేస్తూ మైండ్స్పేస్ వద్ద నిర్మించిన స్కైవాక్ వే అందుబాటులోకి రావడంతో
ఐటీ ఉద్యోగుల ప్రయాణపు వెతలు తీరాయి. వలయాకారంలో ఉండే ఈ స్కైవాక్ పై నుంచి ఐటీ ఉద్యోగులు వారివారి సంస్థలకు
సులభంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆకట్టుకునే విధంగా, సులభంగా రోడ్డు దాటే విధంగా ఉన్న ఈ పై వంతెన నుంచి
రాకపోకలు సాగించేందుకు హైటెక్ వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆదివారం ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కూతురును
సరదాగా స్కైవాక్పై తిప్పుతుండగా.. ఇలా సంబురపడిపోయింది.