హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలోని శ్రీ దుర్గాభవాని, శ్రీ దక్షిణామూర్తి సహిత ఆలయంలో ఇవాళ అంగరంగ వైభంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని(Sitharamula Kalyanam) నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి దుర్గా ప్రసాద్ శర్మ .. సీతారాముల వివాహ మహోత్సవ క్రతువును నిర్వహించారు.
భక్తులు భారీ సంఖ్యలో కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎన్వీఎన్ రెడ్డి, రామకృష్ణ, నగేశ్, కృష్ణ, రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఆ తర్వాత చీరలను వేలం వేశారు.