DSP Siraj : టీ20 వరల్డ్కప్ హీరో మొహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) పోలీస్ యూనిఫామ్ ధరించాడు. మైదానంలో బంతితో నిప్పులు చెరిగే ఈ స్పీడ్స్టర్.. డీఎస్పీ హోదాలో తొలిసారి డీజీపీ సీవీ ఆనంద్ను కలిశాడు. సోమవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సిరాజ్ మర్యాదపూర్వకంగా సీవీ ఆనంద్తో భేటీ అయ్యారు. అనంతర తన 73వ నంబర్ జెర్సీని డీజీపీ బహూకరించాడు.
హైదరాబాద్లో పుట్టిపెరిగిన సిరాజ్ భారత జట్టులో కీలక బౌలర్గా ఎదిగాడు. పొట్టి ప్రపంచకప్ 2024లో టీమిండియా విజయంలో సిరాజ్ పాత్రను కొనియాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతడిని డీఎస్పీగా నియమించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో తొలిసారి యూనిఫామ్లో సిరాజ్ డీజీపీ కార్యాలయానికి వెళ్లాడు. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్ను కలిశాడు. ఈ సందర్భంగా ఇరువురు క్రికెట్ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం సిరాజ్ తన 73వ నంబర్ జెర్సీని సీవీ ఆనంద్కు కానకగా ఇచ్చాడు.
DSP Mohammed Siraj meets Telangana DGP C.V. Anand in Hyderabad. 🤝👮♂️#MohammedSiraj #Cricket #Police #Sportskeeda pic.twitter.com/La6It7FYTf
— Sportskeeda (@Sportskeeda) July 20, 2026
నిరుడు ఇంగ్లండ్ పర్యటనలో సంచలన బౌలింగ్తో మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ విన్నర్గా అవతరించాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు(Oval Test)లో అద్భుత బౌలింగ్కుగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) అవార్డు అందుకున్నాడీ స్పీడ్స్టర్. ఆగస్టు నెలకుగానూ అతడికి ఈ గౌరవం లభించింది. ఐదు టెస్టుల సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడిన సిరాజ్.. ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్చపరిచాడు.

తన ఫిట్నెస్తో పాటు చెక్కుచెదరని ఏకాగ్రతతో అందరి ప్రశంసలు అందుకున్న మియా భాయ్.. నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో నిప్పులు చెరిగాడు. బుమ్రా గైర్హాజరీలో పేస్ దళం బాధ్యతలను భుజాన వేసుకున్న అతడు తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు.. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు.