హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మించనున్నారు. ఈ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..
-రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 0.9కిలో మీటర్ల దూరంలో ఎయిర్పోర్టు టెర్మినల్ నిర్మాణం
-ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్లుక్లోజ్డ్ సర్క్యూట్తో ఉంటాయి.
-శంషాబాద్ ఎయిర్పోర్టులో కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా రెండు స్టేషన్లు
-ఆరు బోగీలు నిలిపేలా మెట్రోస్టేషన్ నిర్మాణం, తొలి దశలో మూడు బోగీలు మాత్రమే
-పొడవు:31 కిలోమీటర్లు (మొత్తం)
-ఎలివేటెడ్ వే: 27.5 కిలోమీటర్లు
-రోడ్ వే: 1 కిలోమీటర్
-అండర్ గ్రౌండ్ వే: 2.5 కిలోమీటర్లు
-వేగం: గరిష్ఠంగా 120 కిలోమీటర్లు
-ఫ్రీక్వెన్సీ: 2.5నిమిషాలు (పీక్ ఆవర్స్)
-సమయం:26 నిమిషాలు
-స్టేషన్లు: 8 లేదా 9 (ప్రతిపాదన ప్రకారం)
-ప్రారంభం: రాయదుర్గం టెర్మినల్ (నూతనంగా)
-నిర్మాణ సమయం: 36 నెలలు
-అంచనా వ్యయం: 6250 కోట్లు