సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో విద్యనభ్యసించాలని దళిత స్త్రీశక్తి కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అన్నారు. ఆదివారం దోమలగూడలోని వసతి గృహం, ఎర్రమంజిల్లోని విద్యార్థులకు లింగ సమానత్వంపై అవగాహన కల్పించారు.
ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా దళిత స్త్రీశక్తి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఎస్ నేతలు భాగ్యలక్ష్మి, సుమతి, హేమలత, సునీత, కీర్తన పాల్గొన్నారు.