Executive Engineer : నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Executive Engineer)గా పనిచేస్తున్న లట్చుబుక్త శ్రీనివాస రావు అవినీతి నిరోధక(ACB) అధికారులకు దొరికాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట సబ్ డివిజన్-1 నీటిపారుదల శాఖలో ఏఈగా ఉన్న శ్రీనివాస రావు సోమవారం రైతు నుంచి రూ.2లక్షల లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
తమ వ్యవసాయ భూమి పక్కనే ఉన్న దొంతికుంట ట్యాంక్ నుంచి మట్టి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని బాధితుడు ఏఈ శ్రీనివాసరావును కోరాడు. అందుకు అతడు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దాంతో, సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో మాటు వేసిన ఏసీబీ అధికారులు సోమవారం శ్రీనివాసరావు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి వరంగల్ జడ్డి ముందు హాజరుపరిచారు.