చార్మినార్, నవంబర్ 6: సెట్విన్ ఆధ్వర్యంలో సరికొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు సెట్విన్ డైరెక్టర్ కె.వేణుగోపాల్రావు తెలిపారు. శనివారం సెట్విన్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త కోర్సులను ఆన్లైన్ ద్వారా మూడు, ఆరు నెలల కాల వ్యవధిలో 25 కోర్సులను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో ఫైథాన్, ఏఐ అండ్ ఎంఎల్తో పాటు సివిల్ ఆటోకాడ్, డాట్నెట్, రోబోటిక్ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. ఈ కోర్సులకు ప్రవేశాలు ఆన్లైన్లోనే జరుగుతాయని డైరెక్టర్ వేణుగోపాల్రావు తెలిపారు.