సిటీబ్యూరో, జులై 8(నమస్తే తెలంగాణ): సిటీ సెక్యూరిటీ వింగ్లో డాగ్ స్కాడ్ కోసం దాతల సహకారంతో నిర్మించిన నాలుగు ఆధునిక షెల్టర్లను సీపీ అంజనీకుమార్ గురువారం ప్రారంభించారు. గోషామహల్లోని సిటీ సెక్యూరిటీ వింగ్(సీఎస్డబ్ల్యూ) ఆవరణలో లారూస్ ల్యాబ్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో డాక్టర్ సత్యనారాయణ రూ. 5.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించగా, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డాగ్ కెన్నల్ను నిర్మించారు. ఎండ వేడిని తగ్గించి లోపల చల్లదనంగా ఉండేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రస్తుతం శిక్షణ పొందిన 23 శునకాలు ఉండగా, త్వరలోనే మరికొన్ని రానున్నాయి. ప్రారంభోత్సవంలో నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్, సీఎస్డబ్ల్యూ అదనపు డీసీపీలు శ్రీనివాస్రెడ్డి, కృష్ణారెడ్డి, లారూస్ సంస్థకు చెందిన ఈడీ వీవీ రవికుమార్, ఉపాధ్యక్షులు రమణారావు పాల్గొన్నారు.