నేరేడ్మెట్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం సీపీ మహేశ్ భగవత్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ వెబ్సైట్లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ అందించే సేవలతో పాటు ఐటీ కారిడార్లో భద్రతకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, ఆర్కేఎస్సీ చైర్మన్ దాస్ గునలన్, ప్రధాన కార్యదర్శి సతీశ్ వడ్లమని, కోశాధికారి జీఎస్ కొహారీ, అదనపు డీసీపీ అడ్మిన్ శిల్పవల్లి, ఉమెన్స్ ఫోరమ్ సంయుక్త కార్యదర్శి లత సుబ్రహ్మణ్యం, ఛీప్ కో-ఆర్డినేటర్ సావిత్రి, లతారామ్, మార్గదర్శక్ నందిత, తదితరులు పాల్గొన్నారు. ఈ వెబ్సైట్ పోర్టల్ను www.rksc.org.in లో వీక్షించవచ్చు.