చిక్కడపల్లి, జనవరి10 : కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు కార్మిక శాఖ సహాయ అధికారులు బీబీఎస్ స్వామి, ఎ.సత్యనారాయణ రెడ్డి, ఎస్.వెంకటరమణ తెలిపారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని కార్మిక శాఖ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. 2022- 2023 ఏడాది ప్రతిభ కనబరిచిన వారికి ఉపకార వేతనాలను అంజేస్తామని, ఫిబ్రవరి15లోపు కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణులైన వారికి రూ.1000, పాలిటెక్నిక్కు రూ. 1500, ఇంజినీరింగ్, మెడిసిన్ , లా, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ, బీఫార్మసీ పూర్తి చేసిన వారికి రూ.2000 అందజేస్తామని తెలిపారు.