ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీజీఈటీ – 2025లో భాగంగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల మొదటి దశ, రెండో దశ ప్రవేశాలకు షెడ్యూల్ను విడుదల చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు.
15వ తేదీన వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 15, 16 తేదీల్లో వెబ్ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 17వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక సీట్ల కేటాయింపు జాబితాను 21వ తేదీన విడుదల చేస్తామని, అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో 24వ తేదీలోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇతర వివరాలకు అభ్యర్థులు తమ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.