గోల్నాక, జనవరి 29 : అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్ సునార్ బౌలి మైదానానికి మహర్దశ కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఎన్నో ఏండ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలంలో స్థానికుల విన్నపం మేరకు మోడ్రన్ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. ప్రేమ్నగర్ సునార్బౌలిలోని సుమారు 7వందల చదరపు గజాలు ఉన్న ప్రభుత్వ స్థలం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో పాటు వివాదాస్పదంగా మారి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్ ఇ. విజయ్కుమార్గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడి ఇరు వర్గాల మధ్య రాజీ కుదుర్చారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి సమస్యాత్మక స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల విన్నపం మేరకు అక్కడి వారు సేద తీరేలా సుందరమైన మోడ్రన్ పార్కు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.40లక్షలు కేటాయిస్తున్నట్లు కాలేరు వెంకటేశ్ ప్రకటించారు. వారం రోజుల్లో పార్కుకు సంబంధించిన డిజైనింగ్ పూర్తి చేసి నాలుగు నెలల వ్యవధిలో పార్కును అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్కు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సునార్బౌలి బస్తీ ప్రతినిధులు నరసింహ, అంజయ్య, వెంకట నరసయ్య, యాదగిరి, సత్యనారాయణ, శేఖర్, మథిన్, మహమ్మద్గౌస్, ఇంతియాజ్, షేక్మహబూబ్, అజ్గర్, అజ్మత్, అస్లాం, రెహమాన్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సంత్ సేవాలాల్ జయంతికి విస్తృత ఏర్పాట్లు ..
బంజారాల ఆరాధ్య ధైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 284వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఆదివారం అంబర్పేట డివిజన్ న్యూపటేల్నగర్ సరస్వతి విద్యానికేతన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బజరంగ్ బంజారా సేవా సంఘం గిరిజన హక్కుల అత్మీయ సమావేశానికి స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15వ తేదీన సద్గురు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అంబర్పేటలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. తన స్వంత ఖర్చుతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంజారాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో బంజారా సేవా సంఘం నాయకులు జటావత్ రమేశ్ నాయక్, వీరన్న నాయక్, చందర్నాయక్, గోపాల్, మన్నయ్య, రవి, లక్ష్మణ్, మొచ్చునాయక్, వెంకన్న, అనిల్, చందు, బాపనాయక్, చక్రినాయక్, కృష్ణ నాయక్, నరేశ్నాయక్ తదితరులతో పాటు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్ పాల్గొన్నారు.