ముషీరాబాద్ ఆగస్టు 1: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. రాంనగర్ చౌరస్తా, అడిక్మెట్ డివిజన్ విద్యానగర్లలో జరిగిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు మిఠాయిలు పంచి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగనుందన్నారు. వేలాది మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని అన్నారు. నగరం నలుదిక్కులా మెట్రో విస్తరణకు మంత్రిమండలి ఆమోదించి రూ.60 వేల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు దూర దృష్టితో మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయం తో నగరానికి వచ్చిపోయే వారికి ప్రయాణ సౌకర్యం సు లువుకానుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గు ర్తించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, ఆ పార్టీ రాంనగర్, అడిక్మెట్, ముషీరాబాద్, భోలక్పూర్ డివిజన్ల అధ్యక్షుడు రావులపాటి మోజస్, శ్రీనివాస్రెడ్డి, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, వై.శ్రీనివాస్, శ్యామ్యాదవ్, రామాలయం చైర్మన్ రవియాదవ్, మాధవ్, దామోదర్రెడ్డి, ముఠా నరేశ్, సయ్యద్ అస్లాం, సంపూర్ణ, నీలాదేవి, తులసీ తదితరులు పాల్గొన్నారు.
విద్యానగర్లో…
అడిక్మెట్ డివిజన్ విద్యానగర్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కె.సురేందర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపాల్ పాల్గొని కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, అనూరాధ, మాధవి, గోవింద్, శంకర్ ముదిరాజ్, అబ్బు, ఖలీల్ పాల్గొన్నారు.
ముషీరాబాద్ డిపోలో ..
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ముషీరాబాద్ డిపోలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, డిపో మేనేజర్ కిషన్రావు ఉద్యోగులు, కార్మికులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు మిఠాయిలు పంచి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు వి.కల్యాణి, సతీశ్కుమార్, క్రిష్ణ, జీపీఆర్ రెడ్డి, రవినాథ్, కైలాసం తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల రక్షణకు పటిష్ట చర్యలు అవసరం
చిక్కడపల్లి : ఆలయాల రక్షణకు పటిష్ట చర్యలు అవసరమని ఎమ్మెలే ముఠా గోపాల్ అన్నారు. నగరంలో ప్రసిద్ధి గాంచిన వివేక్నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన చండీ హోమం, సత్యనారాయణ స్వా మి వ్రతం కర్యాక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, చిక్కడపల్లి సీఐ పిడమర్తి నరేశ్, సీసీ కెమెరాల దాత రంగు శ్యామ్గౌడ్, ఆలయ చైర్మన్ జి. మురళీప్రసాద్, ఈవో మాచర్ల దేవనాథం, ధర్మకర్తలు బాసాని పద్మ సూర్యప్రకాశ్, జీకే రమణ, మురికి గణేశ్, బీఆర్ నాయకులు ముఠా నరేశ్, పున్న సత్యనారాయణ, రవిశంకర్గుప్తా పాల్గొన్నారు.