బంజారాహిల్స్, సెప్టెంబర్ 23 : అత్యాధునిక రోబోటిక్ అసిస్ట్ యాంజియోప్లాస్టీ విధానం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను గుర్తించేందుకు కార్డియాటిక్ కేర్ను జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానలో అందుబాటులోకి తీసుకువచ్చామని అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్ డా.పీసీ.రథ్, సీనియర్ కన్సల్టెంట్ డా.ఎ.శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అపోలో సీఈవో సుబ్రమణ్యం, డా.రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.