సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 ( నమస్తే తెలంగాణ): ఈనెల 17న నార్సింగ్ సమీపంలోని సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ సింగిల్ లైన్పై 200 మంది సైక్లిస్టులతో హెచ్సీజీ ఆధ్వర్యంలో సైక్లింగ్ రైడ్ ఉంటుందని ఆ సంస్థ ఫౌండర్ నందనూరి రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైక్లింగ్ ప్రాధాన్యతకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగానే సైక్లింగ్ ప్రాధాన్యతపై మరింత అవగాహన కల్పించేందుకు రైడ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న సైక్లిస్టులు 9885440308 నంబర్లో సంప్రదించాలని సూచించారు.