సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : నగరంలో మరో నాలుగు సిటీ బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు బుధవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు. ఉప్పల్ -మెహిదీపట్నం (113టీ ఐ/ఎం) సర్వీసు వయా హబ్సిగూడ, తార్నాక, అడిక్మెట్, విద్యానగర్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఆర్టీసీ క్రాస్రోడ్, ఇందిరాపార్కు మీదుగా నాలుగు మెట్రో సర్వీసులు ఏర్పాటు చేశారు. ఉప్పల్-మెహిదీపట్నం (113జడ్ ఐ/ఎం) వయా రామాంతాపూర్, అంబర్పేట్, జిందాతిలిస్మత్, గోల్నాక, నింబోలిఅడ్డా, కాచిగూడ టూరిస్టు హోటల్, ఫీవర్ హాస్పిటల్, శంకర్మఠ్, ఆర్టీసీ క్రాస్రోడ్, వీఎస్టీ, ఇందిరాపార్కు, లక్డీకాపూల్ మీదుగా నాలుగు ఆర్డినరీ సర్వీసులు ఏర్పాటు చేశారు.
ఉప్పల్ -కొండాపూర్ (113టీ వై/కే) వయా హబ్సిగూడ, తార్నాక, అడిక్మెట్, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్రోడ్, ఇందిరాపార్కు, అమీర్పేట్, యూసూఫ్గూడ, జూబ్లీహిల్స్ మీదుగా ఐదు మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్-మణికొండ (5 కే/ఎం) మార్గంలో బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి వయా బాటా, బైబిల్ హౌస్, ట్యాంక్బండ్, సెక్రటేరియట్, లక్డీకాపూల్, మాసబ్ట్యాంక్ మీదుగా మణికొండకు నడుపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు కోరారు.