చారిత్రక చార్మినార్ చుట్టూ శిథిలావస్థకు చేరుకున్న నాలుగు ప్రవేశ ద్వారాలను పునరుద్ధరించనున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కుతుబ్ షాహీ కాలంలో చార్మినార్ చుట్టూ ఈ చార్ కమాన్లను అందంగా నిర్మించారు.
ఈ రాతి కట్టడాలు పూర్వ వైభవాన్ని కోల్పోయి.. శిథిలావస్థకు చేరడంతో ఓ నగరవాసి వీటి పునరుద్ధరణ కోసం అర్వింద్ కుమార్కు ట్వీట్ చేయగా, ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.