చిక్కడపల్లి : ఫిబ్రవరి 21న విశ్వవ్యాప్తంగా జరిగిన రెడ్ బుక్స్ డే లో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం లోని బుక్ హౌస్ వద్ద ప్రత్యేక సభ నిర్వహించారు. కోయ చంద్రమోహన్ అధ్యక్షత నిర్వహించిన సభలో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రాశస్త్యం గురించి ప్రముఖ వాగ్గేయకారుడు జయరాజ్, కవి యాకూబ్, తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, కన్నడ రచయిత్రి శాంతకుమారి లు మాట్లాడారు.
అనంతరం కవితా పఠనం జరిగింది. ఈ కవి సమ్మేళనం లో కవులు మెర్సీ మార్గరెట్, చక్రవర్తి, మోహన్ కృష్ణ,, నస్రీన్ ఖాన్ ,సలీమా, సాయి భరత్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను నవతెలంగాణ పత్రిక ఎడిటర్ సుధా భాస్కర్ ప్రారంభించారు. ఈ ప్రదర్శన వారం రోజుల పాటు కొనసాగనున్నది.