ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 30 : బీఫార్మసీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ (పీసీఐ) ఎనిమిదో సెమిస్టర్ మేకప్ పరీక్ష ఫీజును సెప్టెంబర్ 8వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని, ఈ పరీక్షలను అదే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ తెలిపారు.