ఆదిమానవుడి కాలం నుంచి ఆధునికం వరకు పాట మానవ సంబంధాలను పెనవేసుకున్నది. మనిషి పుట్టుక నుంచి మరణం వరకూ.. తోడై ఉంటుంది. పాట పుట్టింది శ్రమలోనుంచి, రగిలే గుండెల నుంచి పదునైన అంశాలతో జన సమూహమై ప్రవహించేది పాట అని పలువురు వక్తలు అన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ : పాటలేకుంటే తాను లేనని, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించింది పాటేనని, కమ్మని ప్రేమను, ఆప్యాయతను పంచేది పాటేనని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. శుక్రవారం 35వ జాతీయ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణంలోని అలిశెట్టి వేదికపై నిర్వహించిన పాట-మానవ సంబంధాలు కార్యక్రమంలో పలువురు కళాకారులు, రచయితలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యఅతిథులుగా ప్రమఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జూలూరు గౌరీశంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గోరటి మాట్లాడుతూ మునుషుల జీవితమే పాట అన్నారు. పాట మానవ సంబంధాలను మరింత దగ్గరచేస్తుందని చెప్పారు. అల్లం నారాయణ మాట్లాడుతూ నక్సల్బరీ ఉద్యమాన్ని.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది.. పాటలే అన్నారు. యెష్పాల్, అబంటి వెంకన్న నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో అభినయ శ్రీనివాస్, కోదారి శ్రీనివాస్, గిద్దె రామనర్సయ్య, దయా నర్సింగ్, బోడ చంద్రప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. అంబంటి వెంకన్న రచించిన ‘కల్లుపాట’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
‘విశ్వనాథ సత్యనారాయణ వెయ్యిపడగల’ను అయ్యగారి ప్రభావతి దేవి సంస్కృతంలో అనువదించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ వెయ్యిపడగలను సంస్కృతంలో అనువదించడం ద్వారా తన జన్మసార్థకత అయ్యిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ కుటుంభీకులు మనోహర శ్రీపాణి పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ 5 గ్లోబల్ అంశాలపై తీసుకుంటున్న చర్యలపై హైదరాబాద్ గవర్నర్ లక్ష్మి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెక్రెటరీ నాగరాజు ప్రచారం నిర్వహించారు. కంటి చూపు నివారణ, డయాబెటీస్ నివారణ, పర్యావరణ రక్షణ, ఆకలి జయించడం, పిల్లల్లో క్యాన్సర్ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
చల్లా సరోజినీ దేవి రచించిన ‘విరిసిన వసంతం’ పుస్తకావిష్కరణను అకెళ్ల రాఘవేంద్ర, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ స్టోరీ టెల్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టోరీ టెల్లింగ్ నిర్వహించారు.
బీసీసీఈ ఆధ్వర్యంలో ‘బుద్దకొన్ని ఆలోచనలు’ పుస్తకాన్ని జి.రాములు, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, ఇంద్రవెల్లి రమేశ్, తోపుడుబండి సాధిక్ ఆవిష్కరించారు.
డాక్టర్ కేజీ సంధ్యా విప్లవ్ రచించిన ‘ఆద్యం ఆద్యంతం’ కవితను ప్రొఫెసర్ జి.హరగోపాల్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సత్యవతి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు.
నవ తెలంగాణ నూతన సంవత్సరం క్యాలెండర్ను విమలక్క ఆవిష్కరణ చేశారు. నవ తెలంగాణ జనరల్ మేనేజర్ ఆర్.వాసు, మేనేజర్ కృష్ణారెడ్డి విమలక్కకు పుస్తక బహూకరణ చేశారు.
వి.వీరబ్రహ్మం స్మారక సంచికను కేంద్ర సాహితీ అకాడమీ ఉద్యోగి తిరుపాల్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, జూలూరు గౌరీశంకర్, వీరబ్రహ్మం సతీమణి పద్మావతి, బుక్ ఫెయిర్ కోశాధికారి పి.రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు కోయ చంద్రమెహన్, పూర్వనిర్వాహకులు ఎస్.జయప్రకాశ్, అధ్యాపకుడు వి.సుధకర్ విడుదల చేశారు.
శంకర్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చైర్మన్ గీతారామాస్వామి ఆవిష్కరించారు. తెలంగాణ బుక్ ట్రస్ట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కోయ చంద్రమోహన్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా నాగేశ్వర్, సీనియన్ జర్నలిస్టు కొండూరు వీరయ్య, ప్రొఫెసర్ షెహబాస్, తదితరులు పాల్గొన్నారు.