తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 5: పురస్కారాలు ఆత్మ స్థైర్యాన్ని పెంచుతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నా రు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని జేఎల్ నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన రంగస్థల యువ పురస్కారాల ప్రదానోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెలుగు వర్సిటీ వీసీ టి.కిషన్రావు అధ్యక్షతన షేక్ జాన్ బషీర్కు, ఎమ్.అజయ్లకు ఈ పురస్కారాలను రమణాచారి అందజేసి సత్కరించారు. బళ్ళారి రాఘవ ఆకాంక్షను తెలుగు వర్సిటీ నెరవేస్తుందని రమణాచారి ప్రశంసించారు. వర్సిటీ రంగస్థల కళల శాఖ పీఠాధిపతి డాక్టర్ కోట్ల హనుమంతరావు, శాఖాధిపతి డాక్టర్ బీహెచ్ పద్మప్రియ పాల్గొన్నారు.