ఉప్పల్, ఆగస్టు 19: సమాజశ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ హరితస్ఫూర్తిని కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన హరితహారం కార్యక్రమానికి సంతోష్కుమార్తోపాటు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. భవిష్యత్తరాల కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని, హరిత తెలంగాణ కోసం తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు హరితస్ఫూర్తిని కొనసాగిస్తూ, మార్గదర్శకంగా నిలువాలన్నారు. కార్యక్రమంలో డీపీఎస్ చైర్మన్ మల్క కొమురయ్య, యశస్వీ, ప్రిన్సిపల్ సునీతారావు, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్రెడ్డి, సాయిజెన్ శేఖర్, డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి, పల్లా కిరణ్కుమార్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, శైలేష్రెడ్డి, ఎర్రం శ్రీనివాస్రెడ్డి, కాటేపల్లి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.