సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాగల ఐదు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నైరుతితో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకున్నాయని, ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.0 డిగ్రీలు, కనిష్ఠం 25.5 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 60% నమోదైనట్లు వివరించారు.