సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సీపీ ప్రజలకు వివరించారు.
వేడుకల సందర్భంగా ప్రజలు రోడ్లపై ప్రయాణం చేస్తుంటారని, అతివేగం ప్రమాదకరమనే విషయాన్ని గుర్తించాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని, పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈవెంట్ వేదికల వద్ద ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని, ప్రవేశ ద్వారం వద్ద అందరిని తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని సూచించారు.
ఈ నిబంధనలు పాటించాలి..