దుండిగల్/కుత్బుల్లాపూర్, జనవరి 19 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నా రు. గురువారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్, పద్మానగర్ ఫేస్-2 కమ్యూనిటీహాల్, సుభాష్నగర్ డివిజన్ గణేశ్గ్రౌండ్ బస్తీ దవాఖాన లో కంటి వెలుగు కార్యక్రమాలను ప్రారంభించారు. అలా గే..కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ సన్న శ్రీశైలం ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ.. సీఎం కేసీఆర్తోనే సాధ్యం అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజలకు ఎంతో మేలు కల్పిస్తుందని, ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, జంట సర్కిళ్ల డీసీలు మంగతాయారు, ప్రశాంతి, ఈఈ కృష్ణచైతన్య, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, పార్టీ యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్యాదవ్, పార్టీ శ్రేణులు సంపత్ మాధవ్రెడ్డి, సత్తిరెడ్డి, కిశోర్చారి, నజీర్, మధుకర్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13,14 డివిజన్లలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు పరీక్షా కేంద్రాలను మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి ప్రారంభించారు. కార్పొరేటర్లు ఆవుల పావని జగన్యాదవ్, రాజేశ్వరి కంటి పరీక్షలు చేయించుకున్న పలువురికి కంటి అద్దాలు, మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాజీ నాయక్, బీఆర్ఎస్ నాయకులు ఆవుల జగన్యాదవ్, కొలన్ సునీల్రెడ్డి, చంద్రగిరి సతీశ్, నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ నాగరాజ్ యాదవ్, బీసీసెల్ ప్రెసిడెంట్ తలారి సాయిముదిరాజ్, 14వ డివిజన్ అధ్యక్షుడు బొబ్బ శ్రీనివాస్, కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ ఎజాజ్ ఖాసిం,డాక్టర్ భవానీప్రసాద్, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని గాగిల్లాపూర్లో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి (శంభీపూర్) క్రిష్ణవేణి కృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య నారాయణ, మండల వైద్యాధికారి డా.నిర్మల, వైస్ చైర్మన్ పద్మారావు, భౌరంపేట్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, కౌన్సిలర్లు కుంటి అరుణ, జోస్పిన్, భరత్కుమార్, అనంతస్వామి, పీఏసీఎస్ డైరెక్టర్ మోహన్ నాయక్, మాజీ సర్పంచ్ శ్రీను, నాయకులు బుచ్చిరెడ్డి, సుధాకర్రెడ్డి, జక్కుల శ్రీనివాస్, జయరాజ్రెడ్డి, రంజిత్రెడ్డి, అశోక్, శ్యామ్రావు, థామస్ రెడ్డి, నర్సింహ, గణేశ్, తదితరులు ఉన్నారు.
నిజాంపేట్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల పరిధుల్లో ఏర్పాటు చేసిన ఆరు కంటి వెలుగు కేంద్రాల్లో గురువారం మొత్తం 509 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో 97మందికి, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 74 మందికి, నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో 338 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 198 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా .. 19 మందికి ఇతర పరీక్షల కోసం సిఫారస్ చేశారు.
అదే విధంగా కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని 5 కంటి వెలుగు కేంద్రాల్లో తొలిరోజు గురువారం 520 మందికి నేత్రపరీక్షలు నిర్వహించారు. ఇందులో 164 మందికి కంటి అద్దాలు అందజేశారు.