కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 21 : విద్యార్థుల్లో గణితం పట్ల అభిరుచిని, ఆసక్తిని పెంపొందించేందుకు గణిత క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత సంబురాల్లో భాగంగా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు గణిత ముగ్గులు (రంగోళి), 9 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణిత క్విజ్ పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు గణిత భావనలను సులభంగా ఆకలింపు చేసుకోవడానికి పాఠశాలలో గణిత క్విజ్ పోటీలను నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపారు. నేడు పాఠశాలలో జరిగే గణిత దినోత్సవంలో విద్యార్థులకు బహుమతులను అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల గణిత ఉపాధ్యాయులు ధమయంతి, మంజులావాణి, శ్రీనివాసులు, పర్మగళ్ల నర్సింహులు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.