కవాడిగూడ : పూల్బాగ్లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు గురువారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని పూల్బాగ్లో టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, స్థానిక నాయకుడు కల్వగోపీలతో కలిసి పాదయాత్ర నిర్వహించి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా పూల్బాగ్లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎస్. యాదగిరి, పూల్బాగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డిడి ఉమేష్, మధు, రవి, పాస్పోర్ట్ శ్రీనివాస్, ప్రభాకర్, మహేష్, ఆనంద్, లక్ష్మయ్య, సుజాత, మైసమ్మ, దుర్గాబాయి, రమేష్, విఠల్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.