సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : పుష్పగిరి పూర్వ పీఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యా నృసింహ భారతిపై ఆకాశవాణి, దూరదర్శన్ పూర్వ డైరెక్టర్ జనరల్ రేవూరు అనంత పద్మనాభరావు రచించిన ‘పుష్పగిరి యంతీంద్రులు’ గ్రంథాన్ని పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి గురువారం ఆవిష్కరించారు. దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికలో విద్యానృసింహభారతీ స్వామి చరిత్ర 16 నెలల పాటు ధారావాహికంగా ప్రచురితమైంది.
శ్రీ విద్యా నృసింహభారతీస్వామి జయంత్యోత్సవాల సందర్భంగా బేగంపేటలోని పుష్పగిరి సంస్థానంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వల్లూరు శ్రీరామచంద్రామూర్తి, పాత్రికేయులు, రచయిత గుండు వల్లీశ్వర్, పోస్ట్మాస్టర్ జనరల్ విద్యాసాగర్ రెడ్డి, దర్శనంమాసపత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ, పుష్పగిరి మఠం పాలనాధికారి పానుగంటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. కాగా పుష్పగిరి పీఠం ఆస్థాన కవిగా అనంత పద్మనాభరావును నియమిస్తున్నట్టు శ్రీ విద్యాశంకర భారతీ స్వామి తమ అనుగ్రహ భాషణంలో ప్రకటించారు.