శామీర్పేట, మార్చి 29 : రైతును రాజు చేయాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరాన్ని నిర్మించి తెలంగాణకు సాగునీటిని అందిస్తున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని వ్యవసాయదారుల సేవా సహకార సంఘం కార్యాలయం, గోదామును ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, వాణీదేవి, డీసీసీపీ చైర్మన్ మహనోహర్రెడ్డిలతో కలిసి బుధవారం ప్రారంభించారు. రైతులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం రైతాంగం కోసం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ చూడాలని, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి కోరిక మేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని రైతాంగాన్ని దశల వారీగా తన సొంత ఖర్చులతో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. శామీర్పేటలోని రెడ్డి కాలనీలో నిర్మించిన మల్టీపర్పస్ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు రవీందర్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్, వ్యవసాయదారుల సేవా సహకార సంఘం చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.