అంబర్పేట, డిసెంబర్ 14 : ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూలు లక్ష్యాన్ని అధిగమించాలని అంబర్పేట సర్కిల్ డీసీ మారుతి దివాకర్ తన సిబ్బందికి సూచించారు. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో గురువారం బిల్ కలెక్టర్లతో డీసీ సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆస్తి పన్ను వసూలుపై దిశానిర్దేశం చేశారు. ముందుగా ఆస్తి పన్ను బకాయిదారులపై ఫోకస్ పెట్టాలన్నారు. అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఈ ఏడాది వసూలు లక్ష్యాన్ని చేరుకోవాలని, అందుకు సిబ్బంది అంతా సహకరించాలని ఆయన అన్నారు.
ఓటర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఎపిక్ కార్డులను మొత్తం ఓటర్లకు అందజేయాలని డీసీ మారుతి దివాకర్ బీఎల్వోలకు చెప్పారు. దీనిపై ఆయన గురువారం బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఉన్న తప్పొప్పులను కూడా సరిచేయాలని తెలిపారు. చనిపోయిన వారి పేర్లు ఉన్నైట్లెతే వాటిని గుర్తించి తొలగించాలని ఆయన అన్నారు.