బంజారాహిల్స్, సెప్టెంబర్ 14 : హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రంలో ఈనెల 23న నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు బి.సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. బుధవారం బంజారాహిల్స్లోని హయాత్ప్లేస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో హైదరాబాద్ అగ్ర మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా నిలిచిందని, అందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందన్నారు.
23 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే ప్రాపర్టీ షోలో డెవలపర్లు, బిల్డర్లు, ప్రమోటర్లు అందుబాటులో ఉంటారని, ఈ రంగానికి చెందిన వందలాది ఉప్పత్తుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ కోశాధికారి కాళీప్రసాద్ దామెర, సెక్రటరీ జనరల్ విజయ్సాయి మేక, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ కె.శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు