హిమాయత్నగర్ : రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్స్గా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రిన్సిపాల్స్గా పదోన్నతి కల్పించాలని కోరుతూ జూనియర్, డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సోమన్న మాట్లాడుతూ ఉన్నత విద్యా ర్హతలు, డాక్టరేట్ డిగ్రీలు పొంది గత 30 ఏండ్లుగా ఫిజికల్ డైరెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రిన్సిపాల్స్గా ప్రమోషన్ కల్పించలేదన్నారు.
విద్యార్థుల మానసిక వికాసానికి కృషి చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడంలో ఫిజికల్ డైరెక్టర్స్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పదోన్నతి కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు ఆయన చేప్పారు. మంత్రిని కలిసిన వారిలో డాక్టర్ జగన్మోహన్, బి.లక్ష్మయ్య, డాక్టర్ బాలరాజు, డాక్టర్ సురేష్రెడ్డి, నర్సింగ్రావు ఉన్నారు.