కవాడిగూడ, జూలై 19ః దేశవ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లకేజీ కావడంతో నీట్ అభ్యర్థులు 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి చావులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ యూత్ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, వారికి ఎవరు భరోసా కల్పిస్తారన్న డిమాండ్తో సోనం వాంగ్చుక్ ఢిల్లీలో చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు.