హైదరాబాద్ : హైదరాబాద్లోని గాజులరామారంలో అందమైన ప్రాణ వాయు అర్బన్ ఫారెస్ట్ పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. 142 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు పచ్చదనంతో కళకళలాడుతోంది. రూ. 16 కోట్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ పార్కును అభివృద్ధి చేసింది.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మూడు వారాల్లో పార్కును ప్రారంభించబోతున్నామని తెలిపారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పార్కులో అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. పార్కు ప్రధాన ద్వారంతో పాటు కంపౌండ్ వాల్పై జంతువుల ప్రతిరూపాలను చిత్రీకరించారు. హంస, సింహం, పులి, జింక వంటి చిత్రాలను అక్కడక్కడ ఏర్పాటు చేశారు. వన భోజనాలకు కూడా సౌకర్యాలు కల్పించారు. నర్సరీ, వాచ్ టవర్, విశ్రాంతి గదులతో పాటు ఇతర సదుపాయాలను కల్పించినట్లు అధికారి పేర్కొన్నారు.