ముషీరాబాద్, ఆగస్టు 9: రచయిత, నటుడు నల్లూరి వెంకటేశ్వర్ రావు రచించిన ‘నలభై ఏళ్ల ప్రజా నాట్య మండలి’ పుస్తకావిష్కరణ సభ సోమవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగింది. కార్యక్రమంలో తెలుగు విశ్వ విద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి, వందెమాతరం శ్రీనివాస్, తమ్మారెడ్డి భరద్వాజలతో కలిసి 40 యేళ్ల ప్రజా నాట్యమండలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. అనంతరం, ప్రజా నాట్యమండలి నాయకులు కందిమల్ల ప్రతాప్రెడ్డి, నల్లూరి వెంకటేశ్వర్ రావులను ఘనంగా సత్కరించారు.