హయత్నగర్, జూన్ 29: పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం హయత్నగర్లోని నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ ప్రధాన కార్యాలయంలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన బాయిలర్, కోల్డ్ స్టోరేజ్, విస్తరించిన పెరుగు ప్లాంట్, విజయ నల్లగొండ-రంగారెడ్డి నూతన బ్రాండ్ పాల ప్యాకెట్లను సంస్థ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, పాలతోపాటు బై ప్రొడక్ట్స్ మార్కెటింగ్ పెంచుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. సంస్థ మనుగడలో ఉద్యోగుల పాత్ర కీలకమని, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ డైరెక్టర్ బెలిదె కృష్ణ, డైరెక్టర్లు అరుకాల గాల్రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, చింతలపురి వెంకట్రామిరెడ్డి, కర్నాటి జయశ్రీ, చల్లా సురేందర్రెడ్డి, రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డి, కోట్ల జలేందర్రెడ్డి, కందాల అలివేలు, గూడూరు శ్రీధర్రెడ్డి, గొల్లపల్లి రాంరెడ్డి, మందడి ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యానాల కృష్ణారెడ్డి, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.