జగద్గిరిగుట్ట,ఏప్రిల్ 14: కిరాణా దుకాణం ముసుగులో సాగిస్తున్న గంజాయి దందా జగద్గిరిగుట్టలో బయటపడింది. ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట అంజయ్యనగర్ నివాసి మనోజ్కుమార్ అగర్వాల్ (54) కొంతకాలంగా జయశ్రీ ట్రేడర్స్ పేరుతో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశలో అతడు కోల్కతలో గంజాయి సరఫరా చేసే మోహన్తో చేతులు కలిపాడు. కిరాణా దుకాణంలోనే గంజాయి దాచి, పొడి గంజాయితో పాటు, గంజాయితో తయారైన చాక్లెట్లను కూడా విక్రయిస్తున్నాడు.
కోల్కత నుంచి మోహన్ గంజాయిని హైదరాబాద్కు సరఫరా చేస్తుండగా.. కిరాణా షాపు ముసుగులో మనోజ్కుమార్ విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ, స్థానిక పోలీసులు ఆదివారం దుకాణంపై దాడి చేశాడు. రూ.1.66లక్షల విలువైన నాలుగు కిలోల గంజాయి పొడి, 160 గంజాయితో తయారు చేసిన చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ కుమార్ అగర్వాల్ను పోలీసులు అరెస్టు చేశారు. మోహన్ పరారీలో ఉన్నాడని తెలిపారు.