కీసర, జూలై 13: పేకాటలో దొరికిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని కీసరదాయరలో ఓ నాయకుడి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు ప్రజాప్రతినిధులతో పాటు, ఇద్దరు నాయకులు పేకాట ఆడుతుండగా, మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
రూ.91,250 నగదు, రెండు జతల కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వారిని కీసర పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేశారు.