సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): ముస్కాన్-8 స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాచకొండ పోలీసులు మంగల్పల్లిలోని రిషబ్ ఇండస్ట్రీస్ వర్క్ షాప్లో పనిచేస్తున్న బాలకార్మికులను రక్షించి.. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
రాజస్థాన్కు చెందిన నరేశ్జైన్ ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో రిషబ్ ఇండస్ట్రీస్ పేరుతో నిర్వహిస్తున్న కంపెనీపై విశ్వసనీయ సమాచారంతో ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ లేబర్ అఫీసర్, రాచకొండ ముస్కాన్ టీమ్, ఇబ్రహీంపట్నం పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. నలుగురు బాలికలకు విముక్తి కల్పించారు.