సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మారణాయుధాలతో ప్రజ ల్లో తిరుగుతూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. బాలాపూర్ షాహీన్నగర్, క్యూబా కాలనీకి చెందిన మహ్మద్ గౌస్, షేక్ ఆసీఫ్, సయ్యద్ ఖలీల్ స్నేహితులు.
డాగర్, కత్తులు పట్టుకొని ప్రజల్లో తిరుగుతూ.. వాటిని వీడియో తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలను చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. క్యూబా కాలనీలో ఎస్సై హరిందర్ వాహనాలు తనఖీ చేస్తుండగా ఈ ముగ్గురు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి డాగర్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నదని ఈ ముగ్గురు యువకులేనని పోలీసులు గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.