సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ లిబర్టీ ఎక్స్రోడ్లో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాల క్యాబిన్ను అడ్డాగా చేసుకొని నెల రోజులుగా పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 30,940 నగదు స్వాధీనం చేసుకున్నామని టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపారు.
ధూల్పేటకు చెందిన అమిత్సింగ్, ఎండీ ముస్తాఫా (మిరాలంమండి), అర్జున్యాదవ్(కార్వాన్), ఎండీ నసీర్ (శాలిబండ), అంబదాస్(ఓల్డ్ మలక్పేట్), ఎండీ షాహన్వాజ్ (హసన్నగర్), అమీర్బాబా(వట్టెపల్లి), ఎండీ ఇమ్రాన్ (సంతోష్నగర్) చిన్న చిన్న పనులు చేస్తుంటారు. వీరంతా కలిసి నెల రోజులుగా అక్రమంగా జీహెచ్ఎంసీ భోజన క్యాబిన్ను అడ్డాగా చేసుకుని.. మూడు కార్డుల ఆట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణ నిమిత్తం నిందితులను సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.