హైదరాబాద్ : అయోధ్య రాముడికి పోచంపల్లి పట్టువస్త్రాల సమర్పణ సంతోషంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయంలో పద్మశాలీ(Padmashali ) సంఘం ఆధ్వర్యంలో అయోధ్య రాముడికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను మగ్గంపై తయారీని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
ఈ వస్త్రాలను ఈ నెల 29 వ తేదీన అయోధ్యకు తీసుకెళ్లి సమర్పించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, ఆలయ ఈవో బాల్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఇరబత్రి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్ రెడ్డి, పి. శేఖర్, పుష్పాలత, పద్మశాలి సంఘం ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే ఇరబత్రి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.