కీసర, నవంబర్ 9 : గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి (డీఎస్ఓ) శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఎంపీడీవో పద్మావతి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్, నర్సరీ టార్గెట్, బహిరంగ మల,మూత్ర విసర్జన, ఈజీఎస్ వర్క్స్, లేబర్ మొబిలైజేషన్, బీపీపీవీ, కొవిడ్ టీకాపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డీఎస్ఓ మాట్లాడుతూ వచ్చే సంవత్సరానికి గాను మండలంలోని 10 పంచాయతీల్లో కొత్తగా ఏర్పాటు చేసే నర్సరీలో రకరకాల మొక్కలను పెంచి జిల్లా కలెక్టర్ గ్రామాలకు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో బహిరంగ మల, మూత్ర విసర్జనను నిషేధించాలని, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద పంచాయతీల ఆధ్వర్యంలో మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీవో మంగతాయారు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.