సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఉగాండా దేశానికి చెందిన మహిళపై సోమవారం రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ను విధించారు. ఉగాండాకు చెందిన నముబిరు సియానా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చింది. టోలీచౌకి వద్ద అద్దె ఇంట్లో ఉంటున్నది. కొందరు అమ్మాయిలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని.. నమ్మించి వారి ఫొటోలను లొకాంటో వెబ్సైట్లో పెట్టి ఆన్లైన్ ద్వారా దందాను నిర్వహిస్తున్నది. రాచకొండ హ్యూమన్ ట్రాఫికింగ్ టీం, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా నముబిరు సియానాను అరెస్టు చేసి.. మరో ఉగాండా దేశస్తురాలిని హై కోర్టు అనుమతితో రెస్క్యూ హోంకు తరలించారు. ప్రస్తుతం నముబిరు చంచల్గూడ మహిళా జైలులో ఉంది. ఆమె నేర ప్రక్రియను పరిశీలించిన సీపీ.. పీడీ యాక్ట్ విధించి ఏడాది పాటు జైలులో ఉండేలా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.