కాచిగూడ : స్వచ్ఛ సర్వేక్షణ్తో నగర రూపు రేఖలు మారుతాయని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లో ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న అమరేశ్వరి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నుందుకు గాను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశల్లో చెత్తను వేయరాదని, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ స్వచ్ఛ సర్వేక్షణ్ను చేపట్టారని, ప్రజా ఉద్యమంలా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజలు, యువత తమవంతు బాధ్యతగా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి,కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర బీష్మా, దాత్రిక్ నాగేందర్బాబ్జి, బి.కృష్టాగౌడ్, విజితారెడ్డి, జలమండలి మేనేజర్ భావన, రమాదేవి,తదితరులు పాల్గొన్నారు.